బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ వేదికగా ఆయన ప్రారంభించనున్నారు. శంషాబాద్లోని గిరిజన మహిళ సోనీ నాయక్కు తొలి సభ్యత్వం ఇవ్వనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసగించనున్నారు. షా పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు.తెలంగాణలో పార్టీని బాగా బలపరిచి.. అదే సమయంలో... అధికార టీఆర్ఎస్పై విరుచుకుపడుతూ... ఎన్నికల్లో గెలుపు సాధించడానికి ఏం చెయ్యాలో అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం...