Secunderabad: సికింద్రాబాద్‌ బస్‌స్టేషన్‌లో ప్రమాదం

Secunderabad: రెండు బస్సుల మధ్య ఇరుక్కొని వ్యక్తి మృతి * బస్‌ స్టాప్‌లో బస్ కోసం వేచి ఉన్న వ్యక్తి

Update: 2021-06-27 11:54 GMT

Representational Image

Secunderabad: సికింద్రాబాద్‌ బస్‌స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుడు రెండు బస్సుల మధ్య ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. బస్‌స్టాప్‌లో బస్ కోసం వేచి ఉన్న ఒక వ్యక్తి బస్సు ఎక్కేందుకు వస్తున్న క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ క్రమంలో అతనిపై బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతను తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు రెండు బస్సుల మధ్య పూర్తిగా నలిగిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకున్న కాసేపటికి అతను మరణించాడు. 

Tags:    

Similar News