Hyderabad: కుక్కను ఢీకొట్టి యువకుడు మృతి

Update: 2020-02-24 03:07 GMT

ఈ రోజు ( సోమవారం ) ఉదయం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వేగంగా వెళ్తున్న యువకుడికి కుక్క అడ్డం వచ్చింది దీనితో దానినుండి తప్పించుకోబోయిన ఆ యువకుడు దుపుతప్పి కుక్కను ఢీకొట్టి ఆపై డివైడర్‌ను ఢీకొట్టాడు. దీనితో ఆ యువకుడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో కుక్క కూడా చనిపోయింది. ఈ ప్రమాదంలో మరో వాహనదారునికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఒకవేళ ఆ యువకుడు హెల్మెట్ ధరించి ఉంటే కనుక ప్రాణాలతో బయటపడేవాడని అంటున్నారు. హెల్మెట్ తప్పకుండ ధరించాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు.. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరంలో వరుస రోడ్డుప్రమాదాలు జరగడం ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న నగరంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి గాయాలయ్యాయి.  

Tags:    

Similar News