పెద్దపల్లిలో దారుణం.. మైనర్ బాలికపై హత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి
Peddapally: బాలిక చివరి మాటలను ఆడియో రికార్డు చేసిన బంధువులు
Peddapally: పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో బాలిక మృతి చెందింది. రెండు రోజుల క్రితం అప్పన్నపేట శివారు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఘటన చోటు చేసుకుంది. గ్యాంగ్ రేప్ తర్వాత ఎవరికైనా చెబితే.. చంపేస్తామంటూ బెదిరించారని బాలిక చివరి మాటలను ఆడియో రికార్డు చేశారు బంధువులు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.