తల్లి మరణం తట్టుకోలేక ఓ యువకుడి ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో

Update: 2020-03-17 09:01 GMT

అమ్మ కలలోకి వస్తున్నావ్‌ ఇక్కడ ఉండాలని లేదు నీ దగ్గరకే వస్తున్నానంటూ సెల్ఫీ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన రాకేష్‌ తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక తనువుచాలించాడు. రాకేష్ తల్లి లక్ష్మీ ఏడాది క్రితం క్యాన్సర్‌ వ్యాధితో చనిపోయింది. దీంతో రాకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన స్నేహితులతో తల్లి మరణాన్ని చెప్పకుంటూ బాధపడేవాడు. మూడు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న రాకేష్‌ తన తల్లి దహనం చేసిన చోటకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటూ అమ్మ నీ దగ్గరకు వస్తున్నా, ఇక్కడ ఉండాలన్పించడం లేదని వీడియోలో చెబుతూ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేష్‌ మృతి చెందాడు.



Tags:    

Similar News