హుజూర్ నగర్లో భారీ ఆధిక్యం దిశగా టీఆర్ఎస్..ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి..
హుజూర్నగర్ ఉప ఎన్నికలో మొదటి రౌండ్ నుంచి ఇప్పటి వరకూ 'కారు' జోరు కొనసాగుతూనే ఉంది. అధికార టీఆరెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎనిమిదో రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ పూర్తయ్యేసరికి సైదిరెడ్డికి 17,400 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఈ ఉప ఎన్నిక తుది ఫలితం మధ్యాహ్నం 12 గంటలకు వెలువడనుంది.