మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం.. ఒకే గ్రామంలో 29 మందికి కరోనా

Mancherial: మంచిర్యాల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది.

Update: 2021-07-30 11:01 GMT

మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం

Mancherial: మంచిర్యాల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. బెల్లంపల్లి మండలం అకెనపల్లి గ్రామంలో 29 మందికి కరోనా సోకింది. గ్రామానికి చెందిన ఓ ఫ్యామిలీ మహారాష్ట్రలోని పెళ్లి వేడుకకు హాజరై వచ్చారు. వీరిలో 8మందికి కరోనా సోకింది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమై చుట్టుపక్కల వారికి కూడా టెస్టులు చేశారు. 50మందికి పరీక్షలు చేస్తే 29 మందికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఈ అకెనపల్లి గ్రామాన్ని కంటోన్మెంట్‌ జోనుగా ప్రకటించారు.

Tags:    

Similar News