Coronavirus: తెలంగాణలో 2,251 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Coronavirus: గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి * తెలంగాణలో 21,864 యాక్టివ్ కేసులు
కరోన (ఫైల్ ఇమేజ్)
Coronavirus: తెలంగాణలో కరోనా కలవర పెడుతోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 79వేల 27 పరీక్షలు నిర్వహించగా 2వేల, 251 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 3లక్షల, 29వేల, 529కి చేరింది. మరోవైపు కొవిడ్తో చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 1765కి చేరింది. నిన్న కరోనా నుంచి 565 మంది కోలుకోగా ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3లక్షల, 5వేల, 900కి చేరింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 355 కేసులు నమోదయ్యాయి.