ఖమ్మం స్టేడియంలో భారి అగ్ని ప్రమాదం

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో భారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2019-10-28 04:20 GMT

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో భారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలప్రకారం దీపావళి సందర్భంగా స్టేడియంలో బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు.

ఒక్కసారిగా నిప్పు ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు కాని ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పాటు చుట్టుపక్కన వున్న మిగతా దుకాణాలకు కుడా మంటలు చెలరేగాయి. అక్కడున్న ప్రజలు, దుకాణ దారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రజలు అప్రమతం కావడంతో ప్రాణనష్టం జరగలేదు కాని భారి ఆస్తినష్టం సంభవించి ఉంటుందని దుకాణాదారులు అంచనా వేస్తునారు.


Full View



Similar News