ఐటీ ఉద్యోగులకి పెద్ద ఎదురుదెబ్బ.. ఉద్యోగులని తొలగిస్తున్న ఫేమస్‌ కంపెనీ..!

IT employees: మీరు ఐటి సెక్టార్‌లో పనిచేస్తున్నట్లయితే ఇది మీకు చెడ్డ వార్త అవుతుంది.

Update: 2022-09-14 09:24 GMT

ఐటీ ఉద్యోగులకి పెద్ద ఎదురుదెబ్బ.. ఉద్యోగులని తొలగిస్తున్న ఫేమస్‌ కంపెనీ..!

IT employees: మీరు ఐటి సెక్టార్‌లో పనిచేస్తున్నట్లయితే ఇది మీకు చెడ్డ వార్త అవుతుంది. ఎందుకంటే టెక్ రంగంలో మూడో అతిపెద్ద కంపెనీ అయిన హెచ్‌సిఎల్ టెక్ గ్లోబల్ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. దాదాపు 350 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇందులో భారత్‌తో పాటు గ్వాటెమాల, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఈ 350 మంది ఉద్యోగులకు చివరి రోజు సెప్టెంబర్ 30గా తేలిపోయింది.

మందగమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఐటీ దిగ్గజ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. తొలగించిన ఉద్యోగులలో మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్న క్లయింట్లు కూడా ఉన్నారు. ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఐటీ రంగానికి చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఉద్యోగుల ప్రకారం టౌన్ హాల్ మీటింగ్‌లో కంపెనీ ఈ లేఆఫ్ గురించి సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం దీనిపై అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

మీడియా నివేదికల ప్రకారం హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయం TCS, Wipro, Infosys వంటి పెద్ద కంపెనీలని కూడా ఆందోళనకి గురిచేస్తుంది. తొలగించిన 350 ఉద్యోగుల భవిష్యత్‌ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది ఈ ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Tags:    

Similar News