Wimbledon Tennis Tournament: జోకోవిచ్ జోరు.. సానియా - బోపన్న బోణి

Wimbledon 2021: వింబుల్డన్ గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతుంది.

Update: 2021-07-03 06:04 GMT
నోవాక్ జకోవిక్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Wimbledon Tennis Tournament: వింబుల్డన్ గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతుంది. మహిళల్లో స్పెయిన్ తరపున ఎన్నో ఆశలు పెట్టుకొని బరిలోకి దిగిన 2017 వింబుల్డన్ ఛాంపియన్ గార్బిన్‌ ముగురుజాకు మూడోరౌండ్‌లో ట్యూనేషియాకి చెందిన జేబుర్ చేతిలో 7-5,3-6,2-6 తో ఓటమిపాలయ్యింది. సెర్బియన్ కి చెందిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ శుక్రవారం జరిగిన మూడో రౌండ్ లో అమెరికా ఆటగాడైన డెనిస్ కుడ్లాపై 6-4,6-3,7-6 తో ఘనవిజయం సాధించి ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు.

మరోపక్క మహిళల్లో ఇతర సీడెడ్‌లు సబలెంకా, స్వియటెక్‌, ప్లిస్కోవా తో పాటు పురుషుల విభాగంలో ఐదోసీడ్‌ రుబ్లేవ్‌, ఎనిమిదో సీడ్‌ అగట్‌ కూడా ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత ద్వయం సానియా మీర్జా- రోహన్‌ బోపన్న జోడీ 6-2,7-6,7-5 తో భారత్ కి చెందిన రామనాథన్- అంకిత జోడిపై విజయం సాధించి రెండో రౌండ్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ పోరులో ఏడో సీడ్‌ స్వియాటెక్‌ 6-1, 6-0తో ఇరినా బెగు (బెల్జియం)ను చిత్తు చేసింది.

Tags:    

Similar News