తొలి మ్యాచ్ లోనే నవదీప్ సైనీ అదరగొట్టాడు. తను వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్.. తన తోలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో వరుసగా రెండు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. దీంతో ఐదు ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. భారత జత్తూ బౌలింగ్ ధాటికి విండీస్ బ్యాట్స్ మెన్ క్యూ కడుతున్నారు.
ఆరో వోవర్లో ఖలీల్ అహ్మద్ విండీస్ బ్యాట్స్ మెన్ పొవెల్ ను అవుట్ చేశాడు. దీంతో ఆరు ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. భారత జట్టు ఫీల్డింగ్ కూడా చాలా బావుంది. జాన్ క్యాంప్ బెల్, లూయీస్, పూరణ్, హిట్ మాయార్, పావెల్ అవుటయ్యారు. క్రీజులో పోలార్డ్, బ్రెట్ వైట్ ఉన్నారు.
Dream debut for Navdeep Saini as he picks up two in two.
— BCCI (@BCCI) August 3, 2019
West Indies 28/4 after 5 https://t.co/tyexRLRode #WIvIND pic.twitter.com/BtVvzKoCry