T20 World Cup: ఉత్కంఠపోరులో వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ

T20 World Cup: చివరి బంతికి ఫోర్ కొట్టలేకపోయిన బంగ్లాదేశ్ కెప్టెన్

Update: 2021-10-29 15:19 GMT
బాంగ్లాదేశ్ పై ఘానవిజయం సాధించిన వెస్టిండీస్ (ఫైల్ ఇమేజ్)

T20 World Cup: టీ20 వాల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరు జరిగింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతికి ఫోర్ కొడితే గెలుస్తారనగా, బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా చేతులెత్తేశాడు. దీంతో వెస్టిండీస్ అనూహ్యరీతిలో విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేయగా లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ 44 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మదుల్లా 31 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. విండీస్ బౌలర్లలో రాంపాల్, హోల్డర్, రస్సెల్, హోసీన్, బ్రావో తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News