రహానే, విహారి అర్థ సెంచరీలు: డ్రాగా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్

అజింక్య రాహానే, హనుమ విహారి అర్థ సెంచరీలతో రాణించారు. దీంతో విండీస్ ఎ, టీమిండియా మధ్య జరిగిన మూడురోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా గా ముగిసింది.

Update: 2019-08-20 05:00 GMT

వెస్టిండీస్‌ ఎ జట్టుతో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా గా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 84/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లకు 188/5 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. రాహానే (54), హనుమ విహారి (64) అర్థసెంచరీలు సాధించారు. దీంతో మొత్తం 30 5 పరుగుల భారీ విజయలక్ష్యం విండీస్ ముందు ఉంచింది భారత జట్టు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో 21 ఓవర్లు ఆడిన విండీస్ మూడు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. దానితో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజా చెరో వికెట్ తీశారు.


Tags:    

Similar News