బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్తో ఆశ్చర్యపరిచాడు. జడేజా వేసిన 32వ ఓవర్లో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. జడేజా వేసిన మూడో బంతికి మార్నస్ లుబుషేన్ (54 పరుగులు, 64 బంతుల్లో, 5ఫోర్లు ) కవర్స్ దిశగా బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు కెప్టెన్ కోహ్లీ డైవ్ చేసి కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ క్యాచ్ చూసి లబుషేన్ ఆశ్చర్యపోయాడు. కొన్ని క్షణాల పాటు కోహ్లీ వైపు చూసి లబుషేన్ నిరాశగా పెవిలియన్ దారి పట్టాడు. లబుషేన్కి భారత్ పై తొలి వన్డే కెరీర్ ఆరంభించాడు. రాజ్కోట్ వన్డేలోనూ 46 వద్ద జడేజా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. బెంగళూరులో జరిగిన మూడో వన్డేలో కూడా జడేజా వికెట్ చేజార్చుకోవడం గమనార్హం.
India fans after watching that Virat Kohli catch: pic.twitter.com/Yps1Agoy60
— ICC (@ICC) January 19, 2020