ప్రేమను ఆస్వాదిస్తున్న కోహ్లీ
టీమిండియా కెప్టెన్ కోహ్లీ తన జీవిత భాగస్వామి బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్స్టాలో పొస్టు చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల్లోనూ భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లీ తన జీవిత భాగస్వామి బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్స్టాలో పొస్టు చేసుకున్నాడు.బంగ్లాదేశ్ సిరీస్ కొంత సమయం ఉండడంతో ప్లేయర్లకు విశ్రాంతి లభించింది. దీంతో దొరికిన కొద్ది సమయాన్ని కోహ్లీ ఆస్వాదిస్తున్నాడు. భార్యపై తన ప్రేమను చాటుతున్నాడు.
ఇన్స్టాలో ఫొటో పొస్టు చేసి ఎమోజీలతో అనుష్కశర్మపై ఉన్న ప్రేమను తెలిపాడు. ముందు సముద్ర జలాలు, తెలుపు ఆకుపచ్చ రంగుల్లో కొండలు ఉన్న ఈ ఫొటో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని చూసిన అభిమానులంతా లైకులు కొడుతున్నారు. దీనిని అభిమానులు విపరీతంగా షేర్ లు చేస్తున్నారు.