India vs England: మరో రికార్డుకు చేరువలో విరాట్‌ కోహ్లీ

India vs England: టీ20ల్లో 3000 పరుగుల మైలురాయికి మరో 72 రన్స్ దూరంలో కోహ్లీ

Update: 2021-03-11 13:30 GMT

విరాట్ కోహ్లీ (ఫొటో ట్విట్టర్)

India vs England: రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకోనున్నాడు. టీ 20 మ్యాచుల్లో 3 వేల పరుగుల మైలురాయికి సమీపంలో ఉన్నాడు. మరో 72 పరుగులు చేస్తే 3వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను చేరుకుంటాడు.

2018లో టీ-20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అప్పటి నుంచి కోహ్లీ పరుగులు వేట కొనసాగుతూనే ఉంది. టీ-20 క్రికెట్ కెరీర్‌లో 25 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ 20 సిరీస్‌లో కోహ్లీ ఎటువంటి మెరుపులు మెరిపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News