సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు.. ప్రభుత్వం తరపున 30 లక్షలు బహుమతి

PV Sindhu - CM Jagan: * విశాఖలో వెంటనే అకాడమీ ప్రారంభించాలి -సీఎం జగన్‌ * రాష్ట్రంలో మరింత మంది సింధులు తయారు కావాలి -జగన్‌

Update: 2021-08-06 09:27 GMT

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు (ట్విట్టర్ ఫోటో)

PV Sindhu - YS Jagan: ఏపీ సీఎం జగన్‌ను పీవీ సింధు మర్యాద పూర్వకంగా కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును సీఎం జగన్‌ అభినందించారు. శాలువా కప్పి సత్కరించారు. ప్రభుత్వం తరపున సింధుకు 30 లక్షల నగదు బహుమతి అందించారు. విశాఖలో వెంటనే అకాడమీ ప్రారంభించాలని, రాష్ట్రంలో మరింత మంది సింధూలు తయారు కావాలని అన్నారు ఏపీ సీఎం జగన్. క్రీడాకారులను ఏపీ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వం అండగా ఉంటే మరిన్ని పతకాలు సాధిస్తానని అన్నారు పీవీ సింధు.

Tags:    

Similar News