ఇంగ్లాండ్ తో తలపడే టీమిండియా సెలెక్షన్ రేపు!

బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ రేపు(20.01.2021) సమావేశం అవుతోంది.

Update: 2021-01-19 06:08 GMT

బీసీసీఐ లోగో 

బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ రేపు(20.01.2021) సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో ఇంగ్లాండ్ పర్యటనలో తొలి రెండు టెస్టులకు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఆసీస్ పర్యటనలో గాయపడిన ఆటగాళ్ళ విషయంలోనూ ఈ సిమావేశం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో యువ క్రికెటర్లు విశేషంగా రాణిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు జట్టు ఎంపిక కొంత క్లిష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆసీస్ గడ్డ పై నటరాజన్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. దీంతో సీనియర్లు..జూనియర్లు ఎవరిని ఎంపిక చేయాలనే సమస్య సెలక్టర్లకు తలనొప్పిగా మారనుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఇంగ్లాండ్ తో భారత్ లో తలపడనుంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు తొలి టెస్టు, ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు రెండో టెస్టు చెన్నై వేదికగా జరగనున్నాయి. శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఈ నెల 27 చెన్నై వస్తుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో లేని ఆటగాళ్ళు జనవరి 23కె భారత్ రానున్నారు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిశాక టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో మ్యాచ్ లు ఆడనుంది. ప్రస్తుతం శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు ఈ నెల 27న చెన్నై రానుంది. ప్రస్తుతం లంకతో ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టులో లేని ఆటగాళ్లు కాస్త ముందుగానే జనవరి 23న భారత్ చేరుకోనున్నారు.

Tags:    

Similar News