Team India Journey Video: 'టీంఇండియా' ఇంగ్లాండ్‌ జర్నీ చూశారా!

డబ్ల్యూటీసీ ఫైనల్‌తోపాటు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీం ఇండియా బుధవారం ఇంగ్లాండ్ చేరుకున్న సంగతి తెలిసిందే.

Update: 2021-06-04 12:55 GMT

టీం ఇండియా ఆటగాళ్లు (ఫొటో ట్విట్టర్)

Team India: డబ్ల్యూటీసీ ఫైనల్‌తోపాటు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీం ఇండియా బుధవారం ఇంగ్లాండ్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు టీం ఇండియా ఆటగాళ్ల జర్నీకి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. 'టీం ఇండియా ఇంగ్లాండ్ చేరుకోవడంలో మరింత ఉత్సాహం పెరిగింది' అని ఆ వీడియోకి టాగ్ లైన్ చేర్చింది. కాగా, ఇంగ్లాండ్ గడ్డపై అటుపెట్టిన భారత ఆటగాళ్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో ఉండనున్నారు. అనంతరం ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.

ఈ వీడియోలో అక్షర్ పటేల్ మాట్లాడుతూ, ఆటగాళ్లను ఒకర్నొకరు కలుసుకోవద్దని బీసీసీఐ తమకు చెప్పిందని పేర్కొన్నాడు. ఈ మూడుల రోజులు మేం ఒంటరిగా ఉండాలని చెప్పుకొచ్చాడు. వీరితో పాటు టీం ఇండియా మహిళల జట్టు సభ్యులు కూడా మూడు రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. జూన్‌17న కోహ్లీసేన న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనుంది.



Tags:    

Similar News