భారత బౌలర్లు విండీస్ లో రెచ్చిపోతున్నారు. మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు తీసి విండీస్ కు చుక్కలు చూపిస్తున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ కోహ్లీ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ ఆది లోనే వికెట్లు తీసి మ్యాచ్ పై పట్టు బిగించారు. మూడు ఓవర్లు ముగిసేసరికి విండీస్ 20 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ చెరో వికెట్ సాధించారు.