T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ యూఏఈ కి తరలనుందా..?

T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ నుంచి యూఏఈకి తరలనుందా.. అంటే అవుననే అంటున్నాయి నివేదికలు.

Update: 2021-05-05 03:00 GMT

టీ20 వరల్డ్ కప్

T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ నుంచి యూఏఈకి తరలనుందా.. అంటే అవుననే అంటున్నాయి నివేదికలు. బీసీసీఐ సైతం తగిన కార్యచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో ఇండియాలో కరోనా మూడో వేవ్‌ తో ప్రమాదం పొంచి ఉందని నిపుణుల హెచ్చరికలతో.. బీసీసీఐ అప్రమత్తమైందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆటగాళ్లకు కరోనా వైరస్‌ సోకడంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు 16 జట్లు ఆడే ప్రపంచకప్‌ నిర్వహణపై అనుమానాలు రెకెత్తుతున్నాయనడంలో సందేహం లేదు. దీంతో ఈ మెగా టోర్నీని యూఏఈకి తరలించేందుకు ఇప్పటికే బోర్డు పెద్దలు కేంద్ర ప్రభుత్వంతో చర్చించారని టాక్. ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా స్పందించిందని సమాచారం.

Tags:    

Similar News