33 ఏళ్ల తర్వాత ఓ భూమిని తిరిగిచ్చేసిన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్

*క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం 30 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం సునీల్ గవాస్కర్ కు భూమి కేటాయింపు

Update: 2022-05-05 02:16 GMT

33 ఏళ్ల తర్వాత ఓ భూమిని తిరిగిచ్చేసిన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్

Sunil Gavaskar: 33 ఏళ్ల తర్వాత ఓ భూమిని తిరిగిచ్చేశారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం 30 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం సునీల్ గవాస్కర్ కు భూమిని కేటాయించింది. బంద్రా శివారులోని ఓ ప్లాట్ ను ఇచ్చింది. అయితే ఇప్పటివరకు అకాడమీని ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో అకాడమీని ఏర్పాటు చేయలేనని ప్రభుత్వానికి సునిల్ గవాస్కర్ లేఖ ద్వారా వివరించారు. దీంతో ప్రభుత్వం అకాడమీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. 

Tags:    

Similar News