Sanath Jayasuriya: శ్రీలంక టీంకు బ్యాడ్ న్యూస్ ..గుడ్ బై చెప్పిన స్టార్

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026లో శ్రీలంక జట్టు వైఫల్యం ఆ దేశ క్రికెట్‌ వర్గాల్లో పెను సంచలనాన్ని రేపింది. సొంత గడ్డపై (భారత్‌తో కలిసి సంయుక్తంగా) మ్యాచ్‌లు జరుగుతున్నా, కనీసం సూపర్‌-8లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Update: 2026-03-01 06:16 GMT

Sanath Jayasuriya: శ్రీలంక టీంకు బ్యాడ్ న్యూస్ ..గుడ్ బై చెప్పిన స్టార్

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026లో శ్రీలంక జట్టు వైఫల్యం ఆ దేశ క్రికెట్‌ వర్గాల్లో పెను సంచలనాన్ని రేపింది. సొంత గడ్డపై (భారత్‌తో కలిసి సంయుక్తంగా) మ్యాచ్‌లు జరుగుతున్నా, కనీసం సూపర్‌-8లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ శ్రీలంక క్రికెట్ దిగ్గజం, హెడ్ కోచ్ సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

భారత్‌తో కలిసి శ్రీలంక ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. పాకిస్థాన్ మ్యాచ్‌లతో పాటు లంక గడ్డపై జరిగిన మ్యాచులు శ్రీలంక జట్టుకు కలిసొస్తాయని అందరూ భావించారు. కానీ, మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన అందుకు భిన్నంగా సాగింది. సూపర్‌-8 దశలో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వడం జయసూర్యను తీవ్రంగా కలచివేసింది. తన పర్యవేక్షణలో జట్టు ఇంత దారుణంగా విఫలం కావడాన్ని జీర్ణించుకోలేక ఆయన తప్పుకోవడమే సరైన నిర్ణయమని భావించారు.

వాస్తవానికి జయసూర్య కోచ్ కాంట్రాక్ట్ జూన్ 2026 వరకు ఉంది. అంటే ఇంకా సమయం ఉన్నప్పటికీ, జట్టు వైఫల్యానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాలని, అది కోచ్‌గా తన బాధ్యతేనని ఆయన ప్రకటించారు. 2024లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జయసూర్య హయాంలో లంక జట్టు కొత్త ఉత్సాహంతో కనిపించింది. కానీ, అత్యంత కీలకమైన ప్రపంచకప్‌లో మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు.

జయసూర్య కోచింగ్ కెరీర్‌లో..మొత్తం 76 మ్యాచ్‌లు ఆడగా, అందులో 36 విజయాలు నమోదు చేసింది. మిశ్రమ విజయాలు సాధించినా, మేజర్ టోర్నీలో వైఫల్యం దెబ్బతీసింది.

జయసూర్య వంటి దిగ్గజం అకస్మాత్తుగా తప్పుకోవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఇప్పుడు డైలమాలో పడింది. త్వరలోనే కీలకమైన ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండటంతో, వీలైనంత త్వరగా అనుభవజ్ఞుడైన కోచ్‌ను నియమించాలని బోర్డు భావిస్తోంది. జయసూర్య అందించిన సేవలను బోర్డు కొనియాడుతూనే, భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించింది.

సనత్ జయసూర్య అంటే శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఒక ధృవతార. ఆటగాడిగా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఆయన, కోచ్‌గా కూడా జట్టును గాడిలో పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఓటమిని హుందాగా అంగీకరించి పదవి నుంచి తప్పుకోవడం ఆయన క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. మరి కొత్త కోచ్ హయాంలోనైనా లంక జట్టు పూర్వ వైభవాన్ని సంపాదిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News