IPL 2024: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్

IPL 2024: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 8గంటలకు మ్యాచ్

Update: 2024-03-25 03:56 GMT

IPL 2024: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్

IPL 2024: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో.. పంజాబ్ కింగ్స్ తలపడనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.. తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్సీబీ..ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది.. బ్యాటింగ్‌లో ఫాఫ్, కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. అనూజ్ రావత్, డీకే మరోసారి రాణించాలని టీం మేనేజ్‌మెంట్ ఆశీస్తోంది. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో మాత్రం డుప్లిసిస్ టీం మెరుగవ్వాల్సి ఉంది. ధారులంగా పరుగులివ్వడంతో పాటు..వికెట్ల తీయడంలో బౌలర్లు విఫలమవుతుండటం ఆ జట్టును కలవరపెడుతోంది. మరోవైపు ఫస్ట్‌గేమ్‌లోనే ఢిల్లీపై పంజా విసిరిన ధావన్ సేన..అదే జోష్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

Tags:    

Similar News