Cricketers Brawl: పోలీసులను చెప్పులతో కొట్టిన క్రికెటర్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

*ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో పోలీసులు, క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో క్రికెటర్లే పోలీసులపై చెప్పులతో దాడి చేసినట్లుగా ఉంది. వీడియో ఆధారంగా నివేదికను స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు సమర్పించారు.

Update: 2023-05-18 08:15 GMT

Cricketers Brawl: పోలీసులను చెప్పులతో కొట్టిన క్రికెటర్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Cricketers Brawl: ఇద్దరు రంజీ క్రికెట్ ఆటగాళ్లను కొట్టారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. మీరట్ లోని ధామాషా పార్క్ గేట్ ఎదుట తమ వాహనాన్ని నిలిపి ఇద్దరు పోలీసులు లోపల భోజనం చేస్తున్నారు. అదే సమయంలో రంజీ ఆటగాళ్లు ప్రశాంత్ చౌదరి, వినీత్ పన్వార్ అక్కడకు వచ్చారు. గేటు ఎదుట తప్పుగా పార్క్ చేశారంటూ సీనియర్ సబ్ ఇన్స్ పెక్టర్ వరుణ్ శర్మ, ఎస్ఐ జితేంద్రతో క్రికెటర్లు వాగ్వాదానికి దిగారు. ఇది శృతి మించి ఘర్షణకు దారి తీసింది. అనంతరం క్రికెటర్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సదరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. ఆటగాళ్లు కూడా పోలీసులపై దాడి చేసిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఇద్దరు క్రికెటర్లు పోలీసులను చెప్పులతో కొడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. తాజా వీడియో ఆధారంగా వాస్తవాలను పొందుపరిచి ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. 


Tags:    

Similar News