Tokyo Olympics: ఒలింపిక్స్ లో సెమి ఫైనల్‌కు చేరిన పీవీ సింధు

Tokyo Olympics: ఇవాళ మధ్యాహ్నం సింధు కీలక మ్యాచ్ * సెమీస్‌లో లో వరల్డ్ నెంబర్ వన్ తైజూ యింగ్ తో సింధు

Update: 2021-07-31 07:26 GMT

టోక్యో ఒలింపిక్స్ లో సెమి ఫైనల్స్ కి చేరుకున్న పీవీ సింధు (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: ఓ వైపు స్వర్ణం గెలవాలన్న కసి మరోవైపు కోట్లాది భారతీయుల ఆశలతో.. విశ్వక్రీడా సమరంలోకి అడుగుపెట్టిన పీవీ సింధు పతకం దిశగా అడుగులు వేస్తోంది. ఒలింపిక్స్‌ బరిలో దిగిన తొలి మ్యాచ్‌ నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తూ వడివడిగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు సింధు ఒక్క అడుగు వేస్తే రజతం ఇంకో రెండు అడుగుల్లో స్వర్ణ పతకం అందుకోవడం ఖాయం. దీంతో అభిమానులంతా పసిడి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

ఆడిన ప్రతీ మ్యాచులో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సెమీస్‌కు చేరిన సింధుకు ఇవాళ అసలు సవాల్‌ను ఎదుర్కోనుంది. ప్రపంచ నంబర్ వన్ తై జుయింగ్‌ను సెమీఫైనల్లో ఢీకొట్టనుంది. ఇప్పటివరకు ఓవరాల్‌పై సింధుపై పైచేయి సాధించిన జుయింగ్‌తో తలపడనుండటంతో.. సెమీస్‌లో ఆమె విజయం సాధించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Full View


Tags:    

Similar News