Pro Kabaddi League 2021: కబడ్డీ.. కబడ్డీ.. నేటి నుండి ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం

Update: 2021-12-22 05:50 GMT

Pro Kabaddi League 2021: కబడ్డీ.. కబడ్డీ.. నేటి నుండి ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం 

Pro Kabaddi League 2021: ఐపీఎల్.. ప్రపంచకప్ ముగిసింది.. ఇక భారత క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్ 8 నేడు ప్రారంభంకానుంది. మొత్తం 12 జట్లు బరిలో నిలిచాయి. కరోనా వైరస్ నేపథ్యంలో సీజన్ 8 మొత్తాన్ని బెంగళూరులోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అభిమానులు లేకుండా నిర్వహిస్తున్నారు. 12 జట్లు బరిలోకి దిగుతున్న ఈ సీజన్ లో లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక టాప్‌ - 6 లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందుతాయి. 2022 ఫిబ్రవరి 26 న ఫైనల్‌తో ప్రో కబడ్డీ సీజన్‌ 8 ముగియనుంది.

నేటి మ్యాచులు:

యు ముంబా X బెంగళూరు బుల్స్ మ్యాచ్ రాత్రి గం. 7:30 నిమిషాలకు

తెలుగు టైటాన్స్ X తమిళ్ తలైవా‌స్‌ మధ్య మ్యాచ్ రాత్రి గం. 8:30 నిమిషాలకు

బెంగాల్‌ వారియర్స్ X యూపీ యోధా మధ్య రాత్రి గం. 9:30 నిమిషాలకు

ప్రో కబడ్డీ లీగ్ లో పాల్గొనే 12 జట్లు:

జైపూర్‌ పింక్‌ పాంథర్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్, తమిళ్‌ తలైవాస్, యూపీ యోధ, బెంగళూరు బుల్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్, బెంగాల్‌ వారియర్స్, దబంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయింట్స్, హరియాణా స్టీలర్స్.

Tags:    

Similar News