IPL 2021:టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై

Update: 2021-04-09 14:22 GMT

రోహిత్, కోహ్లీ ఫైల్ ఫోటో

IPL 2021: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభమైంది. తొలి పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ఆరంభించిన రోహిత్ సేన నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24పరుగులు చేసింది.  రోహిత్(19)రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులో క్రిస్‌లిన్(5) ఉన్నారు. కాగా, తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లూ భావిస్తున్నాయి. దాంతో ఈ మ్యాచ్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు యుజువేంద్ర చాహల్‌కు ఇది వందో ఐపీఎల్‌ మ్యాచ్‌.

ముంబయి ఇండియన్స్‌ జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌, మార్కో జెన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, రజత్‌ పాటిదార్‌, డేనియెల్‌ క్రిస్టియన్, గ్లెన్‌ మాక్స్‌వెల్, వాషింగ్టన్‌ సుందర్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌



Tags:    

Similar News