IPL 2021: ముంబై‌తో తొలి పోరుకు సిద్దమైన కోహ్లీ సేన ఇదే!

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌‌ మరి కొద్ది గంటల్లో ఆరంభం కానుంది.

Update: 2021-04-08 15:16 GMT
RCB Team 

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌‌ మరి కొద్ది గంటల్లో ఆరంభం కానుంది. మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ విజయంతో ఈ ఐపీఎల్ జర్నీని ప్రారంభించాలని ఇరు జట్ల తహతహలాడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బరిలోకి దిగే తుది జట్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఓపెనర్‌ దేవదత్ పడిక్కల్ ఈ సీజన్‌కు ముందు కరోనా వైరస్ బారిన పడడంతో అందరిలో ఆందోళన మొదలైంది. అతను కరోనా నుంచి పూర్తిగా కోలుకొని టీమ్ క్యాంప్‌లో కలిసాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా రాణించిన కోహ్లీ ఐపీఎల్‌లో కూడా ఇన్నింగ్స్ ఆరంభిస్తానని తెలిపాడు. ఈ క్రమంలో పడిక్కల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

తుదిజట్టు :

విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ అజారుద్దీన్(కీపర్), డాన్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీసన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ సచిన్ బేబీ

Tags:    

Similar News