IPL2021 Auction: సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ దక్కించుకున్న ఫ్రాంఛైజీ తెలుసా?

Update: 2021-02-18 15:16 GMT

అర్జున్ టెండూల్కర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

ఐపీఎల్‌ 2021 వేలం ముగిసింది. ఈ వేలంలో సచిన్ తనయుడు అర్జున్‌ తెందూల్కర్ పేరు రాగానే ముంబయి ఇండియన్స్‌ వెంటనే కనీస ధర 20లక్షలకు కొనుగోలు చేసింది. మరే ఇతర జట్టు సొంతం చేసుకొనేందుకు ముందుకు రాలేదు. టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను రూ.1కోటీ రూపాయలకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

ముంబయి పియూష్‌ చావ్లాకు రూ.2.4 కోట్లులకు కొనుగోలు చేసింది. సౌరాష్ట్ర ఎడమచేతి వాటం యువ పేసర్‌ చేతన్‌ సకారియాను లక్ కలిసోచ్చింది. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.1.2 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా యువపేసర్ మెరెడిత్‌ను పంజాబ్‌ కింగ్స్‌ అతడిని రూ.8 కోట్లుకు దక్కించుకుంది. పవన్‌ నేగిని రూ.50 లక్షలకు కోల్‌కతా దక్కించుకుంది. ఈ సీజన్ లో విదేశి ఆటగాళ్లు కాసులు కొల్లగొట్టారుు

Tags:    

Similar News