IPL 2020: మిస్టర్ ఐపీఎల్ రావాలంటూ..

IPL 2020: ఐపీఎల్ 2020లో ఎంఎస్‌ ధోని కెప్టెన్‌లో ‌చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు ఆడగా రెండు మ్యా‌చ్ లు ‌‌ ఓడిపోయింది. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ఆత్మస్థైర్యంపై దెబ్బ‌ప‌డింది.

Update: 2020-09-26 07:35 GMT

raina

IPL 2020: ఐపీఎల్ 2020లో ఎంఎస్‌ ధోని కెప్టెన్‌లో ‌చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు ఆడగా రెండు మ్యా‌చ్ లు ‌‌ ఓడిపోయింది. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ఆత్మస్థైర్యంపై దెబ్బ‌ప‌డింది. టీం మొత్తం తీవ్ర ఒత్తిడిలో ప‌డింది. రాజస్థాన్ పై ఆడిన రెండో మ్యాచ్ 16 పరుగుల తేడాతో ఓడిపోగా ఇక నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ పై 44 పరుగుల తేడాతో పరాజయం పొందింది. బౌలింగ్, బ్యాటింగ్.. ఆ మాటకొస్తే ఫీల్డింగ్ లో టీమ్ బలహీనంగా ఉందనే సందేశాన్ని ఇచ్చాయి.

ఈ మూడింటి మధ్య సమతౌల్యం ఘోరంగా దెబ్బతిన్నది. సమన్వయం లేదు. ఆల్‌రౌండర్ల కొరత ఏర్పడింది. దాని ప్రభావం- టైటిల్ హాట్ ఫేవరెట్ చెన్నై సూపర్‌ కింగ్స్ విజయావకాశాలను ప్రభావితం చేస్తోంది. అయితే చెన్నై ఇలా వరుస పేలవ ప్రదర్శనలు చేయడంతో ఆ జట్టు అభిమానులు అందరూ ఈ ఏడాది ఐపీఎల్ నుండి వెళ్లిపోయిన సురేష్ రైనా మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే రైనా వెళ్లిపోవడం అనేక చర్చలకు దారితీసింది. కానీ ఇప్పుడు చెన్నై జట్టు చేస్తున్న ప్రదర్శన కారణంగా రైనా మళ్ళీ జట్టులోకి రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదిక తెలుపుతున్నారు.

Tags:    

Similar News