IND vs AUS : ఓపెనింగ్లో గిల్, రోహిత్..తొలి వన్డే మ్యాచ్కు భారత జట్టు తుది ప్లేయింగ్ XI ఇదే
టీమిండియా కంగారూల దేశంలో పర్యటిస్తోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ టూర్ గురించిన ప్రాక్టీస్ ఫోటోలు, వీడియోలను బీసీసీఐ ఇప్పటికే పంచుకుంది.
IND vs AUS : ఓపెనింగ్లో గిల్, రోహిత్..తొలి వన్డే మ్యాచ్కు భారత జట్టు తుది ప్లేయింగ్ XI ఇదే
IND vs AUS : టీమిండియా కంగారూల దేశంలో పర్యటిస్తోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ టూర్ గురించిన ప్రాక్టీస్ ఫోటోలు, వీడియోలను బీసీసీఐ ఇప్పటికే పంచుకుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పెర్త్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై తొలి వన్డే మ్యాచ్కు భారత జట్టు ఆడే తుది ప్లేయింగ్ XI ఎలా ఉండబోతోంది అనే చర్చ మొదలైంది. అయితే, గత మ్యాచ్లో సెంచరీ చేసిన ఒక స్టార్ ఆటగాడు ఈ మ్యాచ్కు బయట కూర్చోవడం దాదాపు ఖాయం అని తెలుస్తోంది.
ఈ ఆస్ట్రేలియా పర్యటనలో శుభ్మన్ గిల్ మొదటిసారి భారత జట్టుకు కెప్టెన్సీ వహించనుండగా, రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. పెర్త్ వన్డే కోసం భారత తుది జట్టు అంచనా ప్రకారం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం దాదాపు ఖాయం. ఈ కారణంగా ఇటీవల వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో సెంచరీ సాధించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంది.
మూడవ స్థానంలో విరాట్ కోహ్లి ఆడటం ఖాయం. ఆ తర్వాత నాలుగో స్థానంలో వైస్-కెప్టెన్గా నియమితులైన శ్రేయాస్ అయ్యర్కు అవకాశం దక్కవచ్చు. వైస్ కెప్టెన్ అవ్వడం వల్ల అయ్యర్ స్థానం సేఫ్గానే కనిపిస్తోంది. వన్డేల్లో కీలక ఆటగాడైన కేఎల్ రాహుల్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్గా తుది జట్టులో ఆడతాడు. జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్లో రాహులే ఫస్ట్ ఆప్షన్. ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కవచ్చు. ఈ సిరీస్కు హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం వల్ల, యువ ఆల్రౌండర్లకు ఇది మంచి అవకాశం.
స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లకు జట్టులో స్థానం లభించవచ్చు. వీరు వికెట్లు తీయడంతో పాటు, అవసరమైనప్పుడు బ్యాటింగ్తో పరుగులు చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు. ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ నాయకత్వం వహించనున్నారు. వీరిద్దరూ ప్రధాన పేసర్లుగా ఉంటారు. ఇక మూడవ పేసర్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ లేదా హర్షిత్ రాణాకు అవకాశం దక్కవచ్చు. ఎక్కువ అనుభవం ఉన్నందున ప్రసిద్ధ్ కృష్ణకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI:
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.