Tokyo Olympics: సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత హాకీ మహిళా జట్టు

Tokyo Olympics: ఒలింపిక్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా టీంను చిత్తుగా ఓడించిన భారత్ *అర్జెంటీనాతో తలపడనున్న భారత హాకీ మహిళా జట్టు

Update: 2021-08-03 02:17 GMT

సెమి ఫైనల్ కు చేరిన భారత మహిళా హాకీ టీం (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: హాకీలో భారత అమ్మాయిలు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. కంగారులపై ఆడపులుల్లా గర్జించారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. అంచనాలకు భిన్నంగా ఒలింపిక్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించారు. గుర్జీత్‌కౌర్‌ సూపర్‌ గోల్‌తో క్వార్టర్స్‌లో కంగారూలను చిత్తుచేసి సెమీస్‌కు దూసుకువచ్చారు. సమిష్టి ప్రదర్శనతో ఆసీస్‌కు కన్నీళ్లు మిగిల్చారు. ఇక అర్జెంటీనాతో సెమీస్‌ పోరులో గెలిస్తే భారత హాకీ చరిత్రలో స్వర్ణయుగం మళ్లీ మొదలైనట్లే.

ఇటు భారత పురుషుల జట్టుకూడా మంచి ఫామ్‌లో ఉంది. మొన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో బ్రిటన్ పై నెగ్గింది. ఇక ఇవాళ సెమీస్‌లో బెల్జీయంతో భారత జట్టు తలపడుతోంది. ఈ రెండు జట్లు పథకాలకు అడుగు దూరంలో ఉన్నాయి. మరీ రిజల్ట్‌ ఎలా ఉంటుందో అని భారత హాకీ అభిమానులంతా అతృతగా వెయిట్‌ చేస్తున్నారు.  

Tags:    

Similar News