Ind Vs WI 3rd T20 : భారీ స్కోరు దిశగా భారత్ .. రోహిత్ ఔట్

Update: 2019-12-11 14:31 GMT
rohit sharma

టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగుతుంది. భారత్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. వికెట్ నష్టానికి మొదటి 11 ఓవర్లలోనే 133పరుగులు రాబట్టారు. సొంత గడ్డపై రోహిత్ శర్మ(71, 34 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్సులు)లతో చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ రాహుల్(61, 35బంతుల్లో, 8ఫోర్లు, 2 సిక్సు)తో అర్థ సెంచరీ నమోదు చేసి ధాటిగా ఆడుతున్నాడు. ఇద్దరు ఓపెనర్లు బౌండరీలు, సిక్సర్లుతో విండీస్‌ బౌలర్లపై విరుచుపడ్డారు. ప్రమాధకరంగా మారిన ఓపెనర్ల జోడిని కేస్రిక్ వీడతీశాడు. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

Tags:    

Similar News