టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగుతుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లే కాకుండా అభిమానులు సైతం ఉఠ్కంగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే జరిగిన రెండు టీ20ల్లో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమానంగా నిలిచాయి. అయితే గురువారం జరగుతున్న ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు టైటిల్ కైవసం చేసుకుంటుంది.
వాంఖడేలో మొదట ఫీల్డింగే ఎంచుకునే జట్టు భారీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగే ఎంచుకునే అవకాశం ఉంది.
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శివమ్ దూబే, రాహుల్, పంత్, శ్రేయస్, వాషింగ్టన్ సుందర్, జడేజా, భువనేశ్వర్, దీపక్ చాహర్, చహల్.
వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెపె్టన్), లూయిస్, లెండిల్ సిమన్స్, నికోలస్ పూరన్, కింగ్, హెట్మైర్, జేసన్ హోల్డర్, కాట్రెల్, పియరీ, విలియమ్స్, హేడెన్ వాల్ష్
West Indies have won the toss and will bowl first in the third and final T20I against #TeamIndia.#INDvWI pic.twitter.com/EyOKQn8Poa
— BCCI (@BCCI) December 11, 2019