కటక్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ విజృంభిస్తున్నారు. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, మరో ఓపెనర్ రాహుల్ విండీస్ బౌలర్లపై చెలరేగిపోతున్నారు. 18 ఓవర్లు ముగిసేసరిగి వికెట్ నష్టపోకుండా భారత్ 103 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ (50 పరుగులు, 52 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సు), రాహుల్ (50పరుగులు, 56 బంతుల్లో ,7 ఫోర్లు ) ఆర్థ సెంచరీలతో ధాటిగా ఆడుతున్నారు.