కాసేపట్లో తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మొదలు కానుంది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్కు విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ విజయం కైవసం చేసుకోవాలని చూస్తుంది.
తొలి టీ20లో విఫలమైన టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ పై అందరి దృష్టి సారించింది. పంత్ విఫలమైనప్పటకీ అతని స్థానంలో మరో క్రికెటర్ శాంసన్కు ఆడించాలని సీనియర్లు సూచిస్తున్నారు. పంత్ కు కోహ్లీ పూర్తి మద్దతు తెలుపుతున్నారు. పంత్ ఫామ్ లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో టీ20 శాంసన్ సొంత రాష్ట్రంలో జరుగుతుండడంతో అంతర్జాతీయ మ్యాచ్లో ఆడాలని ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ని 1-1తో సమం చేయాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఉప్పల్ వేదికగా జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు భావిస్తుంది. వెస్టిండీస్ జరగనున్న రెండో టీ20మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని భారత జట్టు ఆశిస్తోంది.