విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టుకు ఓపెనర్లు ఇద్దరూ విండీస్ బౌలర్లపై విరుచుపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు పరుగులు వేట ప్రారంభించారు. భారత ఓపెనర్ల ధాటీకి విండీస్ బౌలర్లు చేతులెత్తాశారు. ధాటిగా ఆడిన రోహిత్ శర్మ ( 110 పరుగులు,115 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సు)తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో తన వన్డే కెరీర్ లో 28వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక మరో ఓపెనర్ రాహుల్ కూడా ధాటీగా ఆడుతున్నాడు. రాహుల్(101 పరుగులు, 104 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సులు)తో సెంచరీతో కదం తొక్కాడు. దీంతో 36.1ఓవర్లోనే భారత్ 221 పరుగులు చేసింది.