India vs South Africa 3rd Test : టీ విరామ సమయానికి భారత్ 205/3

రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీ విరామ సమయానికి భారత్ మూడు వికెట్లకు 205 పరుగులు చేసింది. టీంమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ149 బంతుల్లో 108 పరుగులు చేశాడు. మరో ఎండ్‌‌లో రహానే 74 పరుగులతో రాణిస్తున్నాడు.

Update: 2019-10-19 09:00 GMT

రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీ విరామ సమయానికి భారత్ మూడు వికెట్లకు 205 పరుగులు చేసింది. టీంమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ149 బంతుల్లో 108 పరుగులు చేశాడు. మరో ఎండ్‌‌లో రహానే 74 పరుగులతో రాణిస్తున్నాడు. టాస్ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ రహానే బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు

అందకుముందు సౌతాఫ్రికా బౌలర్ రబాడ ధాటిగా రెండు వికెట్లను త్వరగా కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే రాబడ బౌలింగ్ లో ఎల్గర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు. పుజారాలను ఖాతా తెరవకుండా ఎల్బీడబ్యూతో పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ కోహ్లీ కూడా 12 పరుగులు చేసి ఔటైయ్యాడు. ఈ సమయంలో పీకల లోతు కష్ట్రాల్లో భారత్ పడింది.   

Tags:    

Similar News