India vs South Africa3rd Test: రోహిత్ శర్మ సెంచరీ

రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీంమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 132బంతుల్లో 101 పరుగు సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ధానే బౌలింగ్ లో సిక్స్ సెంచరీ.

Update: 2019-10-19 08:10 GMT

రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీంమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 132బంతుల్లో 101 పరుగు సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ధానే బౌలింగ్ లో తో సెంచరీ సాధించాడు.. మరో ఎండ్‌‌లో రహానే60 పరుగులతో రాణిస్తున్నాడు. దీంతో భారత్ స్కోర్ 184/3చేరింది.టాస్ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ రహానే బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు. 

అందకుముందు సౌతాఫ్రికా బౌలర్ రబాడధాటికి రెండు వికెట్లను త్వరగా కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే రాబడ బౌలింగ్ లో ఎల్గర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు. పుజారాలను ఖాతా తెరవకుండా ఎల్బీడబ్యూతో పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ కోహ్లీ కూడా 12 పరుగులు చేసి ఔటైయ్యాడు. ఈ సమయంలో పీకల లోతు కష్ట్రాల్లో భారత్ పడింది. దీంతో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ కు రహానే తోడవడంతో భారత్ మళ్లీ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.   

Tags:    

Similar News