IND vs PAK: పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో టీం ఇండియా మార్పులు చేస్తుందా? ప్లేయింగ్ ఎలెవెన్లో ఎలా ఉండబోతుంది ?
IND vs PAK: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత చర్చనీయాంశమైన మ్యాచ్ ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్ను టీం ఇండియా విజయంతో ప్రారంభించింది.
IND vs PAK: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత చర్చనీయాంశమైన మ్యాచ్ ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్ను టీం ఇండియా విజయంతో ప్రారంభించింది. అది బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. కాగా, తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు పాకిస్తాన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్లో మార్పు ఉండవచ్చు. అయితే టీం ఇండియాలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
టీం ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతను ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు. అయితే, పంత్ మొదటి మ్యాచ్లో కూడా ఆడలేదు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్ పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో మైదానంలోకి దిగవచ్చు. ప్లేయింగ్ ఎలెవన్లో అతని స్థానం దాదాపు ఖాయం. బంగ్లాదేశ్పై రాహుల్ 41 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్మాన్ గిల్తో కూడా తనకు మంచి పార్టనర్ షిప్ కుదిరింది.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఓపెనింగ్కు రావచ్చు. బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో గిల్ సెంచరీ సాధించాడు. అతడు అజేయంగా 101 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ కూడా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భారత ప్లేయింగ్ ఎలెవన్లో హార్దిక్ పాండ్యా స్థానం దాదాపు ఖాయం.
పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్
తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఇప్పుడు ఆడే పదకొండు మందిలో మార్పులతో జట్టు మైదానంలోకి ప్రవేశించవచ్చు. జట్టులో షాహీన్ అఫ్రిది, నసీమ్ షా స్థానం దాదాపుగా ఖాయం అయినట్లే. మహ్మద్ రిజ్వాన్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా.
పాకిస్తాన్: ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.