IND VS NZ 1st Test : పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

న్యూజిలాండ్‌ - భారత జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ వెల్లింగ్టన్ వేదికగా ఆరంభమైంది.

Update: 2020-02-21 03:03 GMT
IND VS NZ TEST

న్యూజిలాండ్‌ - భారత జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ వెల్లింగ్టన్ వేదికగా ఆరంభమైంది. తొలుత న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ పృథ్వీ షా ఓపెనర్లుగా బరిలోకి దిగారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. 41.1 ఓవర్‌లో హనుమ విహారి(7) జామీసన్‌ బౌలింగ్‌లో అవుటైయ్యాడు. ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(37; 108 బంతుల్లో 4x4), రిషబ్ పంత్ (6) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు.

అంతకుముందు ఓపెనర్‌ పృథ్వీషా(16), పుజారా(11), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(2) విఫలమయ్యారు. 35 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 90/4గా నమోదైంది. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జామీసన్‌ రెండు వికెట్లు తీయగా టిమ్‌సౌథీ, ట్రెంట్‌బౌల్ట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. మయాంక్‌ అగర్వాల్‌ (34; 84 బంతుల్లో 5x4) ట్రెంట్‌బౌల్ట్ బౌలింగ్‌లో జామీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. జామీసన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్‌బౌల్ట్, సౌథీ చెరో వికెట్ దక్కించుకున్నారు.



 

Tags:    

Similar News