T20 World Cup : టాస్ గెలిచిన బంగ్లా.. టీమిండియాకు షాక్ కీలక ప్లేయర్ దూరం

టీ20 మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది.

Update: 2020-02-24 10:53 GMT
India Vs Bangla T20 World Cup

టీ20 మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. పెర్త్‌ వేదికగా భారత్‌తో బంగ్లాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి ఫీల్డీంగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన జ్వరంతో మ్యాచ్‌కు దూరమైంది. కాగా.. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు భారత్‌కు షాక్‌ ఇచ్చి మెగాటోర్నీలో శుభారంభం చేయాలని బంగ్లా పట్టుదలతోఉంది. గ్రూప్‌-ఎలో భారత్‌తో పాటు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. వీటిలో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం న్యూజిలాండ్, భారత్‌, ఆతిథ్య ఆస్ట్రేలియా తలా రెండు పాయింట్లతో పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

తుదిజట్లు :

భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్ (కెప్టెన్)‌, షెఫాలీ వర్మ, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ , రీచా ఘోశ్‌, వేద కృష్ణమూర్తి, శిఖ పాండే, అరుంధతి రెడ్డి, పూనమ్‌ యాదవ్, రాజేశ్వర్‌ గైక్వాడ్‌

బంగ్లా‌: సల్మా ఖతున్‌ (కెప్టెన్),రాజేశ్వర్‌ గైక్వాడ్‌, షమిమా సుల్తానా, సంజిదా ఇస్లామ్‌, నిగర్‌ సుల్తానా, ఫర్గానా హోక్‌, రుమాన అహ్మద్‌, ఫాహిమా ఖతున్‌, జహానారా ఆలం, పన్నా ఘోశ్‌‌, నహిదా అక్తర్‌.



Tags:    

Similar News