టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

Update: 2021-01-19 10:14 GMT

టీమిండియాపై మోదీ ప్రశంసల జల్లు

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు సర్వాత్ర శుభాకాంక్షలు వెళ్లువెత్తున్నాయి. ఈ సందర్బంగా భారత జట్టుకు ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ విజయం సాధించడం సంతోషాన్ని కలిగించిందని మోదీ అన్నారు. ఆటగాళ్ల ఎనర్జీ, ఆట పట్ల తమకున్న అభిరుచి, పట్టుదల, గెలవాలనే సంకల్పం టోర్నీ ఆద్యంతం ప్రతిబింబించింది. టీమిండియాకు అభినందనలు. రాబోయే టోర్నీల్లోనూ మీరు మరిన్ని విజయాలు సాధించాలి అని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు.



Tags:    

Similar News