India vs New Zealand: ఇవాళ భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సెకండ్‌ టీ20 మ్యాచ్

*రాంచీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం *3 టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ ‎

Update: 2021-11-19 01:13 GMT

ఇవాళ భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సెకండ్‌ టీ20 మ్యాచ్(ఫైల్ ఫోటో)

India vs New Zealand: 3 టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య సెకండ్‌ టీ20 మ్యాచ్‌ జరగనుంది. రాంచీ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ రెండు టీమ్‌లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌ను గెలిచి మంచి ఊపుమీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ విజయాన్ని సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.

మరోవైపు టీ 20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి తర్వాత భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ అదే రిజల్ట్ రావడంతో కివీస్ జట్టు కాస్త నిరాశతో ఉంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తోంది.

Tags:    

Similar News