Ind vs Eng: నాగ్ పూర్ లో టీం ఇండియా గెలవడానికి కారణమైన 'ఐఏఎస్' ఎవరు?

Ind vs Eng: ఫార్మాట్ మారింది. టీం ఇండియా ఆటగాళ్లలో సగానికి పైగా మారారు. కానీ భారత గడ్డపై ఇంగ్లాండ్ పరిస్థితి మాత్రం మారలేదు.

Update: 2025-02-07 04:34 GMT

Ind vs Eng: నాగ్ పూర్ లో టీం ఇండియా గెలవడానికి కారణమైన 'ఐఏఎస్' ఎవరు?

Ind vs Eng:

ఫార్మాట్ మారింది. టీం ఇండియా ఆటగాళ్లలో సగానికి పైగా మారారు. కానీ భారత గడ్డపై ఇంగ్లాండ్ పరిస్థితి మాత్రం మారలేదు. టీ20 సిరీస్ లాగే వన్డే సిరీస్ కూడా ఓటమితో ప్రారంభమైంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానికి జట్టులోని అందరు ఆటగాళ్లు సమిష్టి కృషి చేశారు. కానీ ఐఏఎస్ పోషించిన పాత్ర ఆట దిశను నిర్ణయించింది. నాగ్‌పూర్‌లో టీమ్ ఇండియా విజయంలో ఐఏఎస్ పెద్ద పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ ఓటమికి కారణం ఆయనే.

టీం ఇండియా గెలవడానికి కారణమైన ఐఏఎస్ ఎవరు?

ఇంగ్లాండ్ ఓటమికి ఐఏఎస్ ఎలా కారణం అని ఆలోచిస్తున్నారా.. ఇక్కడ IAS అంటే నిజమైన IAS అధికారి కాదండి. టీం ఇండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు. IASలో ఉన్న మూడక్షరాలలో I అంటే అయ్యర్, A అంటే అక్షర్, S అంటే శుభమాన్ గిల్. వీరి ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపితే IAS. వీరి కారణంగానే ఇంగ్లాండ్ ఓడిపోయింది. టీం ఇండియా నాగ్‌పూర్‌లో గెలిచింది.

ముందుగా దేశీయ జట్టులో అద్బుతాలు చేసిన తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన అయ్యర్ గురించి మాట్లాడుకుందాం. అతను ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడతాడో లేదో మొదట కాస్త గందరగోళంలో ఉన్నా.. చివరి క్షణంలో విరాట్ గాయపడడంతో అయ్యర్ కు ఆడే అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని అతడు అందిపుచ్చుకున్నాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన అయ్యర్ 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు.

అయ్యర్ ఔట్ కాగానే అక్షర్ పటేల్ 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. కెఎల్ రాహుల్ ఉన్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో అతనికి ప్రమోషన్ ఇవ్వాలనే నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది కానీ ఇంగ్లాండ్ స్పిన్ మాయాజాలాన్ని ఎదుర్కొనేందుకు భారత జట్టు యాజమాన్యం తీసుకున్న చర్య ఫలించింది. 5వ స్థానంలో ఆడుతున్న అక్షర్ పటేల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 52 పరుగులు చేశాడు.

ఇప్పుడు శుభమాన్ విషయానికి వస్తే విజయానికి తన వంతు కృషి చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. సాధారణంగా వన్డేల్లో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే శుభ్‌మాన్, నాగ్‌పూర్ వన్డేలో ఓపెనర్ గా బ్యాటింగ్‌కు దిగాడు. అతను 96 బంతుల్లో 14 ఫోర్లతో 87 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాగ్‌పూర్‌లో శుభ్‌మాన్, అయ్యర్‌తో కలిసి 94, అక్షర్‌తో కలిసి 108 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇంకా 68 బంతులు మిగిలి ఉండగానే టీమ్ ఇండియా విజయాన్ని నమోదు చేయడంలో సహాయపడ్డాడు.

Tags:    

Similar News