Wrestler Sushil Kumar: సుశీల్‌ కుమార్‌ రిమాండ్‌ పొడిగింపు

Wrestler Sushil Kumar: హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌ కుమార్‌కు రిమాండ్ ఢిల్లీ కోర్టు పొడిగించింది

Update: 2021-05-29 13:43 GMT

రేస్లర్ సుశీల్ కుమార్ (ఫైల్ ఇమేజ్)

Wrestler Sushil Kumar: జూ. రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌ కుమార్‌కు రిమాండ్ ఢిల్లీ కోర్టు పొడిగించింది. సుశీల్ కుమార్ కి మరో 4 రోజుల రిమాండ్‌ పొడిగిస్తున్నట్లు రోహిణి కోర్టు శనివారం తెలిపింది. హత్యకేసులో సుశీల్ తో పాటు అరెస్టయిన అజయ్ కి కూడా రిమాండ్ పొడిగించింది. కాగా మే 23న కోర్టులో హాజరుపరిచిన సుశీల్‌కు ఆరు రోజుల రిమాండ్‌ విధించింది. నేటితో ఆ గడువు పూర్తి కావడంతో కోర్టు మరోసారి రిమాండ్‌ను పొడిగించినట్లు స్పష్టం చేసింది. పోలీసులు 7 రోజుల కస్టడీ కోరగా కోర్టు 4 రోజులకే అనుమతించింది. కరోనా నేపథ్యంలో ప్రతి 24 గంటలకు ఒకసారి సుశీల్ కుమార్ కు మెడికల్ చెకప్ చేయించాలని కోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

23న సుశీల్ కుమార్ కు 6 రోజుల రిమాండ్ విధించగా, అది నేటితో ముగిసింది. దాంతో సుశీల్ కుమార్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 4 రోజుల రిమాండ్ సందర్భంగా సుశీల్ కుమార్ ను ఆయన తరఫు న్యాయవాది కలవొచ్చని పేర్కొంది. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగ‌ర్ రాణా దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. నెల సుశీల్‌, సాగ‌ర్ వ‌ర్గీయుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో సాగ‌ర్ హ‌త్య‌కు గురైన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేల్చారు. దీంతో సుశీల్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు

Tags:    

Similar News