Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ లో భారత్ కు అవమానం.. ఇంతకీ ఏమైందంటే..?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు, పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఇటీవల కరాచీ స్టేడియం వీడియో వైరల్ అయింది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ లో భారత్ కు అవమానం.. ఇంతకీ ఏమైందంటే..?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు, పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఇటీవల కరాచీ స్టేడియం వీడియో వైరల్ అయింది. దీనిలో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కరాచీ స్టేడియంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత జాతీయ జెండాను ఎగురవేయలేదు. కరాచీలోని గడాఫీ స్టేడియంలో టోర్నమెంట్లోని మిగిలిన ఏడు జట్ల జెండాలు మాత్రమే కనిపించాయి. ఇప్పుడు పాకిస్తాన్ గడాఫీ స్టేడియం నుంచి మరో వీడియో వైరల్ అవుతుంది. దీంతో తీవ్ర కలకలం చెలరేగింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త వీడియో కరాచీలోని గడాఫీ స్టేడియంది అని చెబుతున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గడాఫీ స్టేడియంలో భారత జెండాను ఎగురవేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి భారత జెండాను తలక్రిందులుగా పెట్టాడు. దాని కారణంగా మరోసారి భారతీయుల్లో ఆగ్రహం మొదలైంది. ఈ వీడియోలో భారతదేశంతో పాటు, ఇతర దేశాల జెండాలు కూడా కనిపిస్తాయి. వీటిని సరైన పద్ధతిలో ఉంచారు. కానీ త్రివర్ణ పతాకాన్ని మాత్రం తలకిందులుగా ఎగురవేశారు. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలు చేస్తోందని భారత అభిమానులు విమర్శిస్తున్నారు.
గడాఫీ స్టేడియంలో భారత జెండాను ఎగురవేయకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా వివరణ ఇచ్చింది. దీని వెనుక ఉన్న కారణం గురించి పాక్ మీడియా మాట్లాడుతూ.. 'ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్లలో నాలుగు జెండాలు మాత్రమే ఉంటాయని ఐసిసి సూచించింది. ఒకటి ఐసిసి, ఒకటి ఆతిథ్య దేశం , మిగిలినవి రెండు వేర్వేరు దేశాలవి. పిసిబి పేలవమైన వివరణ కూడా గందరగోళాన్ని సృష్టించింది. ఎందుకంటే స్టేడియంలో నాలుగు కంటే ఎక్కువ జెండాలు ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను పాకిస్థాన్కు పంపకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఆ తర్వాత ఐసిసి టీం ఇండియా అన్ని మ్యాచ్లను దుబాయ్కు మార్చింది. ఈ టోర్నమెంట్లో టీం ఇండియా ఫిబ్రవరి 20 నుండి తన ప్రస్తానాన్ని ప్రారంభిస్తుంది. అతని తొలి మ్యాచ్ బంగ్లాదేశ్తో జరుగుతుంది. దీని తర్వాత, భారత జట్టు ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో తలపడనుంది. ప్రతి క్రికెట్ అభిమాని దీని కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్ జట్టుతో మ్యాచ్ జరుగుతుంది.