CSK Management on MS Dhoni: ఆ ఐడియా దోనీదే: సీఎస్ కే సీఈఓ కాశీ విశ్వనాథన్

CSK Management on MS Dhoni: ఐపీఎల్ కోసం దుబాయ్ విమానం ఎక్కడానికి ముందు సీఎస్ కే ఆటగాళ్లంతా చెన్నైలో ప్రాక్టీస్ చేసారు.

Update: 2020-08-28 06:33 GMT

CSK Management on MS Dhoni: ఐపీఎల్ కోసం దుబాయ్ విమానం ఎక్కడానికి ముందు సీఎస్ కే ఆటగాళ్లంతా చెన్నైలో ప్రాక్టీస్ చేసారు. దానికి సంబంధించి ఆ జట్టు వీడియో ను విడుదల చేసింది. 'సర్.. కుర్రాళ్ళంతా 4-5 నెలలుగా క్రికెట్ ఆడలేదు. అందరూ ట్రాక్ లోకి రావాలంటే ప్రాక్టీస్ కావాలి. అందుకే దుబాయ్ లో మాదిరిగానే చెన్నైలో బయో బాబుల్ ఏర్పాటు చేయండి' అంటూ ధోనీ కోరడం వల్లే ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు సీఎస్ కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు.

దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.. మొత్తం 53 రోజుల పాటు 60 మ్యాచ్‌ లు జరగనున్నాయి.. కరోనా నేపద్యంలో జరుగుతున్న సీజన్ కావడంతో ఆటగాళ్ళను నెల రోజుల ముందే అక్కడికి చేర్చాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.. ఇక ఇప్పటికే అక్కడికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఇతర జట్ల ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్నారు.   



Tags:    

Similar News